తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “ఆపద్బాంధవుడు” అనే చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి జంటగా నటించిన ప్రముఖ తమిళ హీరోయిన్ “మీనాక్షి శేషాద్రి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.
అయితే మొదటగా మీనాక్షి శేషాద్రి తెలుగులో ఓ బాలీవుడ్ చిత్ర రీమేక్ లో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
అయినప్పటికీ పట్టు విడవకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఎక్కువగా సినిమా అవకాశాలను దక్కించుకుంది.
అయితే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ఎందుకో “మీనాక్షి శేషాద్రి” తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా పెద్దగా రాణించలేక పోయింది.దీంతో ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.
ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో పని చేస్తున్నటువంటి “హరీష్ మైసూర్” అనే వ్యక్తిని 1995వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.కాగా ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే పెళ్లయిన తర్వాత మీనాక్షి శేషాద్రి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. దీంతో ఓ డ్యాన్స్ అకాడమీని స్థాపించి భరత నాట్యం, కథక్, వంటి కళలలో శిక్షణ ఇస్తోంది.
ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి తన భర్త ,పిల్లలతో కలిసి అమెరికాలోని టెక్సాస్ లో నివాసముంటున్నట్లు సమాచారం.అయితే చివరిగా 1996వ సంవత్సరంలో స్వామి వివేకానంద అనే హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సన్నీ డియోల్ దర్శకత్వం వహించిన “ఘయాల్” అనే చిత్రంలో కనిపించింది. దీంతో మీనాక్షి శేషాద్రి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోందనుకునే లోపే మళ్లీ ఎలాంటి చిత్రాల్లోనూ నటించకుండా అమెరికాకి వెళ్ళి పోయింది
.