చేసిన తప్పుకు ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదని పెద్దలు అంటుంటారు.ఈ మాట నిజమని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.
ఇక ప్రతి రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ రాజకీయ నాయకులు దురుసుగా ప్రవర్తించడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.తమను ఎవరు ఏం చేయరనే ధీమా కావచ్చూ ఇలా ప్రవర్తించదానికి కారణం.
అయితే ఏదో ఒకరోజు ఆ పాపం పండినప్పుడు తప్పక తగిన మూల్యం చెల్లించవలసిందే.ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి 2016 లో దాదాపు 300 మందితో కలిసి ఎయిమ్స్ వద్ద ఉన్న ఫెన్సింగ్ ను కూల్చేసిన ఘటనకు సంబంధించిన కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది.
తాజాగా సోమనాథ్ భారతి పై నమోదైన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించడంతో మేజిస్ట్రేట్ ఏకీభవించి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.
ఇతనికి రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా, రూ. లక్ష జరిమానా విధించడం జరిగింది.ఈ విషయాన్ని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే వెల్లడించారు.