లోక్ సభ ఎన్నికల బరిలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ట్రాన్స్ జెండర్ దిగారు.ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్ జెండర్ భవానీ నాథ్ వాల్మీకీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు చాలా పార్టీలతో మాట్లాడాను.కానీ ఏ ఒక్క పార్టీ కూడా నాకు అవకాశము ఇవ్వలేదు.
కానీ ఆప్ పార్టీ మాత్రం నా విధివిధానాలు,ఆలోచనలు,సిద్ధాంతాలు నచ్చి నాకు అలహాబాద్ స్థానాన్ని కల్పిస్తూ పార్టీలో అవకాశము ఇచ్చింది.నేను సమాజంలో మంచి మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని తెలిపారు.
తొలిసారిగా ట్రాన్స్జెండర్ లోక్సభ ఎన్నికల బరిలో దిగారు.ఉత్తరప్రదేశ్ అలహాబాద్ నియోజకవర్గం నుంచి వాల్మికీ పోటీ చేస్తున్నారు.