సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి,విడాకులు అన్నది సర్వసాధారణమైంది.కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న సెలబ్రిటీ జంటలు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు.
అయితే సెలబ్రిటీలలో చాలావరకు విడాకులు తీసుకున్న తర్వాత కూడా కలుస్తూ ఉంటారు.ఇంకొందరు సెలబ్రిటీలు మాత్రం ఎవరికి వారు వారి వారి జీవితాలను గడుపుతూ ఉంటారు.
ఎక్కువ శాతం మంది సెలబ్రిటీలు విడిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వారి పిల్లల కోసం అలాగే ఏదైనా వెకేషన్ ల కోసం పూజల కోసం కలుస్తూ ఉంటారు.తాజాగా ఒక బాలీవుడ్ జంట విడాకులు తీసుకొని విడిపోయి తర్వాత కూడా ఒక పూజలో పాల్గొంది.
మరి ఆ జంట ఎవరు? ఏమిటి అన్న విషయాల్లోకి వెళ్తే.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, భార్య కిరణ్ రావు విడాకులు తీసుకున్న విడిపోయిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రేక్షకులు అమీర్ ఖాన్ ని మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఇకపోతే అమీర్ ఖాన్ ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత అమీర్ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పాల్గొనడం లేదు.
రాజ్యాంగ అమీర్ ఖాన్ తన మాజీ భార్య అయిన కిరణ్ రావు తో కలిసి పూజ చేస్తూ కనిపించారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ముస్లిం అయిన ఆమిర్ ఖాన్,హిందూ ఆచారాల ప్రకారం తన ఆఫీసులో కలశ పూజ ను చేశారు.ఇక హారతి నివేదనలో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ కూడా పాల్గొంది.
ఈ పూజ కార్యక్రమానికి ఆఫీస్ సిబ్బందితో పాటుగా లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైత్ చందన్ కూడా పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.ఆ ఫోటోలలో తలపై నెహ్రూ క్యాప్ లాంటిది పెట్టుకుని భుజాలపై కండువాతో కనిపించారు అమీర్ ఖాన్.అంతే కాకుండా తల గడ్డం మీసాలు మొత్తం అన్నీ కూడా వైట్ కలర్ లో ఉండి ముసలివాడు లాగా కనిపిస్తున్నాడు.
ఈ మాజీ భార్యాభర్తలు ఎందుకోసం పూజ చేశారు అన్న విషయాన్ని మాత్రం అమీర్ ఖాన్ వెల్లడించలేదు.కొందరు ఈ ఫోటోలపై పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
అయితే అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ ఇప్పటికే చాలా సందర్భాలలో వారిద్దరూ కలుసుకున్న విషయం అందరికీ తెలిసిందే.