బాలీవుడ్ స్టార్ హీరోలలో అమీర్ ఖాన్ ఒకరు.ఈయన ప్రెసెంట్ చేసిన ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది.
అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా ఈ ఏడాది పెద్ద సినిమాల్లో ఒకటిగా రిలీజ్ కాబోతుంది.
అద్వైత్ చందం డైరెక్టర్ చేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.మాములు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.ఈయన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.ఇక నాగ చైతన్య ఎంత మెప్పిస్తాడో చూడాలి.
ఇక బాలీవుడ్ ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకుంది.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు.
ఇదే క్రమంలో మన సౌత్ సినిమాలు అక్కడ వందల కోట్లు వసూలు చేస్తుండడం అక్కడి హీరోలకు మింగుడు పడని విషయంగా మారింది.కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇందుకు విరుద్ధంగా ఉంది.
ఈ సినిమా కూడా ఆశించిన విజయం అందుకుంటుందో లేదో అని టెన్షన్ గా ఉన్నారు.
భారీ విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది.
దీంతో ఈ సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్ పడింది.అమీర్ ఖాన్ దేశం పట్ల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన సినిమాపై ప్రభావం చూపిస్తున్నాయి.
లాల్ సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ ప్రెస్ మీట్ లో తాజాగా స్పందించారు.ఈయన మాట్లాడుతూ.తాను ఎవరి హృదయాన్ని బద్దలు కొట్టాలని అనుకోలేదని.ఎవరైనా సినిమా చూడకూడదు అనుకుంటే దాని గురించి ఏమీ చేయలేను అని తేల్చి చెప్పాడు.
ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.చూడాలి చివరిలో ఏం జరుగుతుందో.