ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంతమంది బిజేపి లీడర్లు ఇంక్రిడబుల్ ఇండియా నుంచి ఆమీర్ ఖాన్ తొలగించినట్లు ప్రకటించారు.ఆమీర్ డబ్బులేమి తీసుకోకుండా భారత టూరిజంని ఇంక్రిడబుల్ ఇండియా పేరుతో ప్రమోట్ చేస్తాడనే విషయం తెలిసిందే.
ఇటివలే ఆమీర్ అసహనం మీద చేసిన వాఖ్యలు వివాదస్పదం అవడంతో కొన్ని మతవర్గాల పెద్దలు ఆమీర్ ని ఇంక్రిడబుల్ ఇండియా నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్ చేసారు.
ఈరోజు ఏకంగా అమిత్ మాల్వియా అనే బిజేపి లీడర్ ఆమీర్ ఇకనుంచి ఇంక్రిడబుల్ ఇండియాకు సేవలు అందించడు అని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రముఖ వార్త ఛానెల్లు, వెబ్ సైట్లు, ఆమీర్ ను ఇంక్రిడబుల్ ఇండియాను తొలగించారనే వార్తలను ప్రసారం చేసాయి.
కొంతమంది ఆమీర్ చేసిన వాఖ్యలకు సరైన శాస్తి జరిగిందని వాఖ్యానిస్తే, మరి కొంతమంది ఆమీర్ దేశానికి చేసిన సేవలు ఈ గవర్నమెంటు మరిచిందని నిరసనలు తెలిపారు.ఈ మిశ్రమ స్పందలను ఆపివేసేందుకు గవర్నమెంటు స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆమీర్ ఖాన్ ఇకపై కూడా ఇంక్రిడబుల్ ఇండియా ప్రచారకర్తగా వ్యవహరిస్తారని, వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది భారత టూరిజం మినిస్ట్రీ.