దాదాపు రెండు దశాబ్దాల క్రితం పదుల సంఖ్యలో సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు ఆమని.సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఆమని చావు కబురు చల్లగా సినిమాలో హీరో కార్తికేయ తల్లి పాత్రలో నటిస్తున్నారు.
ఈ నెల 19వ తేదీన చావు కబురు చల్లగా సినిమా విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.
తన సినీ కెరీర్ లో ఏ సినిమా కోసం షూటింగ్ కు ముందురోజు డైలాగ్ లు ప్రాక్టీస్ చేయలేదని అయితే చావుకబురు చల్లగా సినిమా కోసం మాత్రం అలా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు.
సినిమాలో తన పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుందని.పెద్ద పెద్ద మాస్ డైలాగ్స్ చెప్పే పాత్ర అని ఆమె అన్నారు.సినిమాలోని డైలాగ్ లను బట్టీపట్టి నేర్చుకుని షూటింగ్ లో పాల్గొనేదానినని ఆమని చెప్పుకొచ్చారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒక పాత్రలో నటిస్తుండగా బన్నీ వాసు చావు కబురు చల్లగా సినిమాలో ఛాన్స్ ఇచ్చారని అన్నారు.ఈ సినిమా డైరెక్టర్ కౌశిక్ ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా సినిమాను తెరకెక్కించారని ఆమని అన్నారు.అయితే తన సినీ కెరీర్ లో ఎంతోమంది నటులతో నటించినా ప్రకాశ్ రాజ్ తో కలిసి నటించాలంటే తనకు ఎంతో భయం అని ఆమె అన్నారు.
డైలాగ్ ఎంత పెద్దగా ఉన్నా సింగిల్ టేక్ లోనే ఓకే అయ్యే విధంగా ప్రకాష్ రాజ్ నటిస్తారని ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ సీన్లు ఉంటే రెండో టేక్ తీసుకోవడానికి తనకు భయం వేస్తుందని ఆమె అన్నారు.అవకాశం వస్తే విలన్ పాత్రలో నటిస్తానని ఆమని తెలిపారు.
ఈ సినిమాలో మద్యం తాగుతున్న ఫోటో ఒకటి చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆ ఫోటో సినిమాపై అంచనాలు పెంచుతోంది.