తెలుగు సినీ పరిశ్రమ నటి ఆమని.అప్పటి సినిమాలలో హీరోయిన్ గా నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.తొలిసారిగా ఈ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడిపంబ సినిమాలో హీరోయిన్ గా నటించి సినీ రంగానికి పరిచయమైంది.అంతేకాకుండా తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.
దాదాపు 18 కి పైగా సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమని ప్రస్తుతం సహాయనటిగా చేస్తుంది.హీరో, హీరోయిన్ ల తల్లి పాత్రల్లో నటిస్తున్న ఆమని.ప్రస్తుతం తల్లి గొప్పదనాన్ని గురించి తెలియజేసే చిత్రంలో నటిస్తుంది.ఈ విధంగా ఆమని తన గురించి కొన్ని విషయాలు తెలుపుతూ.
ఆమని సినిమాల సంఖ్య గురించి ఎప్పుడూ పట్టించుకోదట.ఆమె నటించే పాత్రలలో ప్రేక్షకులకు నచ్చడమే తనకు ముఖ్యమని తెలిపింది.
అందుకనే మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి.పాత్రల ఎంపిక విధానంలో ఆలోచిస్తానని తెలిపింది.
ప్రస్తుతం ఆమని శివ ఏటూరి దర్శకత్వంలో వస్తున్న “అమ్మ దీవెన” చిత్రంలో నటిస్తుంది.ఈ సినిమా ను ఎత్తరి కుటుంబానికి సంబంధించిన మారయ్య, చినమారయ్య, గురవయ్య లు నిర్మించారు.”అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, బిచ్చగాడు వంటి సినిమాల్లో చూపించిన అమ్మ గొప్పదనాన్ని తెలియజేసినట్లు.ఈ సినిమాలో కూడా అదే తరహాలో చూపించారు.
ఈ సినిమాలో ఏమీ చదువుకోని లక్ష్మమ్మ అనే తల్లి పాత్రలో తను కనిపించగా.తనకు నలుగురు బిడ్డలు ఉంటారు.
కూలిపని చేసుకుంటూ వాళ్లని ప్రయోజకుల్ని చేస్తుంది.ఆ మధ్యలో ఆమె ఎదుర్కొన్న కొన్ని అడ్డంకుల గురించి తెలియజేసే చిత్రమిది అంటూ ఆమని కొన్ని విషయాలు తెలిపింది.
ఈ విధంగా ” సెకండ్ ఇన్నింగ్స్ ఎలా నాకు లభించిన పాత్ర పట్ల ఎంతో సంతృప్తిగా ఉంది.కొత్త దర్శకులు ఆసక్తి కలిగించే పాత్రలతో నా ముందుకు వస్తున్నారు.
అవకాశం వస్తే ప్రతినాయిక ఉన్న పాత్రల్లో నటించాలనుందని” ఆమని తెలిపింది.ప్రస్తుతం ఆమని చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బ్లాక్ సినిమాల్లో వరుస గా నటిస్తుంది.
అంతేకాకుండా జగపతిబాబు తో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.తమిళంలో త్వరలోనే ఓ సినిమా చేయనుంది.