బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అనురాగ్ కశ్యప్ ఒకరనే సంగతి తెలిసిందే.అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ తాజాగా తను అనుభవించిన మానసిక సమస్యల గురించి వెల్లడించారు.
మానసిక సమస్యల వల్ల తాను యుద్ధమే చేశానని అలియా కశ్యప్ పేర్కొన్నారు.తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అలియా కశ్యప్ ఈ విషయాలను నెటిజన్లకు వెల్లడించారు.
తనకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలోనే డిప్రెషన్ బారిన పడ్డానని ఆమె చెప్పారు.
డిప్రెషన్ నుంచి బయటపడటం తేలికే అయినప్పటికీ తాను మాత్రం అంత సులభంగా డిప్రెషన్ నుంచి బయటపడలేకపోయానని ఆమె అన్నారు.
డిప్రెషన్ బారిన పడిన సమయంలో తనకు చాలా భయం వేసిందని ఆమె తెలిపారు.ఆ సమయంలో తాను చాలా బాధ పడేదానినని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో తనకు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండేవని తాను డిప్రెషన్ లో ఉన్నానని తెలిసి పేరెంట్స్ సైతం ఎంతో మానసిక వేదనను అనుభవించారని అలియా కశ్యప్ చెప్పుకొచ్చారు.
ఒకానొక సమయంలో తాను బెడ్ పై నుంచి కనీసం లేవలేని పరిస్థితి ఏర్పడిందని.శరీరమంతా చెమటలు పట్టడంతో పాటు గుండె వేగం కూడా పెరిగేదని ఆమె చెప్పారు.ఆ సమయంలో తాను చచ్చిపోతానని అనుకున్నానని అలియా పేర్కొన్నారు.
తనకు ఊపిరికి సంబంధించిన సమస్యలు సైతం ఎదురయ్యాయని తరువాత సైకియాట్రిస్ట్ ను సంప్రదించాక తన పరిస్థితి మెరుగైందని ఆమె చెప్పారు.
ఆ తరువాత కాలం అలియా కశ్యప్ డిప్రెషన్ నుంచి మామూలు మనిషయ్యారు.
అలియా కశ్యప్ అనుభవించిన కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.చిన్న వయస్సులోనే అలియా కశ్యప్ ఇన్ని కష్టాలు పడిందా.? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.అలియా కశ్యప్ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.