సినిమాలు సక్సెస్ లు అవకపోయినా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు ఆది సాయి కుమార్.ఆయన హీరోగా నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.అందులో ఒకటి వీరభద్రం డైరక్షన్ లో వస్తుంది.ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.సినిమాకు టైటిల్ గా కిరాతక అని ఫిక్స్ చేశారు.సినిమా టైటిల్ చూస్తుంటేనే స్టోరీ థ్రిల్లర్ గా ఉంటుందని అర్ధమవుతుంది.
ఆల్రెడీ ఆది సాయి కుమార్ తో వీరభద్రం ఇదివరకు చుట్టాలబ్బాయ్ సినిమా చేశాడు.అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాగా ఈసారి మాత్రం థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది.కిరాతక టైటిల్ తోనే ఇలా షేక్ చేస్తుండగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఆరెక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు ఇది ఓ మంచి అవకాశం అని చెప్పొచ్చు.తన మార్క్ సినిమాలైతే చేస్తున్నా ఆడియెన్స్ ను ఇంప్రెస్ ను చేయడంలో వెనకపడ్డాడు ఆది సాయి కుమార్.
మరి కిరాతకతో పాటుగా చేస్తున్న మరో 3 సినిమాలతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.