సూపర్ స్టార్ మహేష్ పాపులారిటి గురించి కొత్తగా చెప్పేదేముంది.మిగితా హీరోలకి తెలుగు రాష్ట్రల్లో అభిమానులుంటే, మహేష్ కి మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నారు.
భాషాభేదం లేకుండా మహేష్ సినిమాల్ని పిచ్చిపిచ్చిగా చూసేస్తుంటారు ఇరుగుపొరుగు జనాలు.అందుకే తెలుగు రాష్ట్రాల బయట కూడా మహేష్ సినిమాల కలెక్షన్లు అంత బలంగా ఉంటాయి.
మలుపు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక టీవి షోలో ముచ్చటించిన హీరో ఆది పినిశెట్టిని తమిళనాడులో క్రేజ్ ఉన్న తెలుగుహీరో ఎవరు, ఏ హీరో తమిళ ఇండస్ట్రీలో సినిమా చేయాలి అని అడగగా అందరు ఊహించనట్టుగానే మహేష్ బాబు అని చెప్పాడు.తమిళనాట చాలా ఇళ్ళలో మహేష్ ఫోటోలు పెట్టుకుంటారని కుడా చెప్పాడు.
ఇక సోషల్ రెస్పాన్సిబిలిటి, ఫాలోయింగ్ ఎవరికుంది? పొలిటిక్స్ లోకి ఎవరు వెళ్ళాలి అంటే తడుముకోకుండా వెంటనే పవన్ కళ్యాణ్ అని చెప్పేసాడు ఆది.అంతేకాదు పవర్ స్టార్ సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు పరిచయమని, వాళ్ళంటికి తాను, తన ఇంటికి మెగా ఫ్యామిలి వచ్చేవారని చెప్పాడు.
మహేష్ ఎలాగో మురుగదాస్ సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.పవన్ త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా మారనున్నాడు.సో, ఆది కొరుకున్నవి రెండు జరుగుతున్నాయి.