ఆనాడు యమధర్మరాజుని ముప్పుతిప్పలు పెట్టి భర్త ప్రాణాలను కాపాడుతుంది సతీ సావిత్రి.ఈనాడు తన ప్రాణాలు పోతాయని తెలిసికూడా భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ముందడుగు వేసింది నేటితరం సతీ సావిత్రి ఓ మహిళ.
నేటి తరానికి ఈ ఘటన నిజంగా ఓ గొప్ప ఆదర్శం అనే చెప్పాలి. చెన్నై లోని రెడ్ హిల్స్ లో 76 ఏళ్ల మదన గోపాల్ అనే వ్యక్తి భార్య లలిత తో కలిసి ఉంటున్నారు.
ఇక ఇటీవల అనారోగ్యం పాలైన మదన గోపాల్ ని ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసిన వైద్యులు.ఈ క్రమంలోనే కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి సేవచేయడానికి తానే దగ్గరుండి చూసుకుంటాను.నా భర్త నేను లేకుండా ఉండలేడు అంటూ లలిత తెలిపింది.
అయితే మహిళ కూడా వృద్ధురాలు కావటంతో డాక్టర్ లు సంశయించినప్పటికీ తర్వాత మాత్రం అంగీకరించారు.
అయితే కరోనా సోకితే మృత్యువు దరికి చేరినట్లే అని తెలుసు అయినప్పటికీ రిస్క్ ఏజ్ లో కూడా ఎనిమిది రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉండి భర్తకు సేవలు చేసింది లలిత.
ప్రతిక్షణం మాస్కు ధరించి భర్త ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చింది సదరు మహిళ.ఈ క్రమంలోనే లలితకు కూడా కొన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్ లు ఇచ్చారు వైద్యులు.
ప్రస్తుతం వారిద్దరిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు వైద్యులు.