కొన్ని నెలల క్రితం దేశంలోని పలు రాష్ట్రాల్లో హనీ ట్రాప్ కేసులు వెలుగులోకి వచ్చాయి.తాజాగా ఈ తరహా మోసాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.
అయితే ఈ మోసాల్లో ఒకే యువతి ముసలోళ్లను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం.ముసలోళ్లకు అందాలను ఎర వేసి మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి గురించి తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
తీగ లాగితే డొంకంతా కదిలి యువతి, ఆ యువతికి సాయం చేసిన వ్యక్తులు ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.అందాలతో ముసలోళ్లను టార్గెట్ చేసి వాళ్లను పెళ్లి చేసుకుని డబ్బులు, నగలతో ఉడాయించడం మోనికా అనే 30 ఏళ్ల యువతికి వెన్నతో పెట్టిన విద్య.
కొన్ని రోజుల క్రితం 66 సంవత్సరాల కాంట్రాక్టర్ గా పని చేసే కిషోర్ అనే వ్యక్తికి భార్య చనిపోయింది.దీంతో మరో పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనియల్ నిర్వాహకురాలు మంజును సంప్రదించాడు.
ఆమె మోనికా అనే అందమైన యువతి ఉందని కిషోర్ కు చెప్పింది.కిషోర్, మోనికా ఒకరికొకరికి నచ్చడంతో సింపుల్ గా వీరు వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లైన రెండు నెలలకే మోనికా 15 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో మోనికా ఉడాయించింది.కిషోర్ వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు మోనికాను పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో మోనికా కిషోర్ తో పాటు మరో ఏడుగురు ముసలోళ్లని వివాహం చేసుకుందని తేలింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.