ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కార్యక్రమంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది.
వెదురుకుప్పం మండలం మారేపల్లిలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తుండగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి ముందే పొన్నెమ్మ అనే మహిళ పురుగుల మందు తాగింది.
వెంటనే స్పందించిన సిబ్బంది బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఇటీవల ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న పొన్నెమ్మను అధికారులు విధుల నుంచి తొలగించారు.
తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నారాయణస్వామికి చెప్పేందుకు పొన్నెమ్మ ప్రయత్నించగా ఆమెను స్థానిక నేతలు అడ్డుకున్నారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.