బిహార్లోని పాట్నాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఒక మహిళ ఫోన్ లో మాట్లాడుతూ కిందకి చూసుకోకుండా మ్యాన్ హోల్లో పడి పోయింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
రహదారి మధ్యలో ఉన్న మ్యాన్ హోల్ ఓపెన్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.రోడ్డుపై నడిచేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని మరి కొందరు సలహా ఇస్తున్నారు.
బయటికి వెళ్ళినప్పుడు ముందు వెనక చూసుకుంటే మంచిదని ఇంకొందరు సూచిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ ఫోన్ లో మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తుండటం చూడొచ్చు.
ఆమె వెనక్కి తిరిగి ముందుకు అడుగులేసింది.దీనితో తన ముందు మ్యాన్హోల్ ఉందనే విషయాన్ని గ్రహించలేక పోయింది.
అలా ఆమె అనుకోకుండా మ్యాన్హోల్లో ఒక్కసారిగా పడిపోయింది.నిజానికి ఆమె నడుస్తున్న రహదారిలో ఒక ఆటో ఉంది.
సరిగ్గా ఆటో కింద ఈ మ్యాన్ హోల్ దాగి ఉంది.అందుకే అసలు దీనిని ఆమె చూడలేకపోయింది.
ఆమె ఒక్కసారిగా కింద పడటం గమనించిన స్థానికులు కాపాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు.నలుగురు వ్యక్తులు ఆమె చేతులు పట్టుకుని పైకి లాగారు.
అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి పెద్ద గాయాలు అవ్వలేదు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆమె బట్టలకు మాత్రం బాగా బురద అంటుకుంది.ఈ మహిళ డ్రైనేజీలో పడుతున్న దృశ్యాలను సమీపంలోని ఒక బిల్డింగ్ లోని సీసీ టీవీ రికార్డ్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోకి ఇప్పటికే 70 వేలకు పైగా లైకులు వచ్చాయి.
ఈ షాకింగ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.