ఆడవారి అందంకు ఎంతటి మగాడైనా పడిపోవాల్సిందే అనేది పురాణ కాలం నుండి ఉన్న విషయమే.మునులు మరియు రుషులు సైతం ఆడవారి గాలి సోకడంతో శృంగార పురుషులు అయిన విషయాలు మనం ఇప్పటి వరకు ఎన్నో చూశాం.
అలాంటిది మామూలు మనుషులు ఒక లెక్కనా.వందలో 99 శాతం మంది కూడా ఆడ గాలి సోకితే కరిగిపోయే వారు ఉంటారు.
ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో బలహీనమైన క్షణంలో బలై పోతూ ఉంటారు.తాజాగా బీహార్కు చెందిన ఒక మహిళ అదే అదునుగా కొత్త తరహా మోసంకు పాల్పడటం మొదలు పెట్టింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీహార్లోని పలు ప్రాంతాల్లో హైవేలపై ఒక మహిళ మోసాలకు పాల్పడింది.దాదాపు 150 మంది లారీ డ్రైవర్లను ఆమె మోసం చేసి వారి నుండి లక్షల్లో డబ్బును గుంజింది.
వారి వద్ద ఉండే బంగారం, డబ్బు తిసుకుని ఉడాయించేంది.ఈమెకు మరో ఇద్దరు సాయంగా ఉండే వారు.వీరి దందా దాదాపు నాలుగు నెలల పాటు సాగింది.నాలుగు నెలల్లో వీరు 150 మంది వరకు లూటీ చేసినట్లుగా ఒప్పుకున్నారు.
ఈ కిలాడీ లేడీ డ్రైవర్లను మోసం చేసే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది.తేనె పూసిన కత్తి అంటారు చూడండి.
అలా ఈమె మోసం, ఈమె కుట్ర ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఆ మాయ లేడీ ప్రియుడు మరియు ఆమె స్నేహితుడు కలిసి ఈ వ్యవహారం సాగించారు.రాత్రి 9 గంటల సమయంలో హైవే పక్కన అందంగా తయారు అయ్యి ఆ మాయ లేడీ నిల్చుంటుంది.చేయి ఎత్తి లారీలను ఆపుతుంది.
ఆమె అందంకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.అందుకే లారీ ఆపేసి ఆమెతో మాట ముచ్చటలో పడతారు.
ఆ తర్వాత పొదల్లోకి వెళ్దామని తీసుకు వెళ్తారు.అప్పటికే అక్కడ మాటు వేసి ఉండే ఆమె ప్రియుడు, స్నేహితుడు డ్రైవర్పై కర్రలతో దాడి చేస్తారు.
విచక్షణ రహితంగా కొట్టి వారి వద్ద ఉండే డబ్బు, నగలు, మొబైల్ ఇంకా విలువైన వస్తువులను వేసుకుని ఉడాయిస్తారు.రోజులో రెండు మూడు సార్లు కూడా వారు చేసిన దాఖలాలు ఉన్నాయి.
ఒక డ్రైవర్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసి మరో ఇద్దరు ముగ్గురు కూడా తమకు కూడా అలాంటి అన్యాయం జరిగిందని చెప్పడంతో పోలీసులు జల్లెడ పట్టి మరీ ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది.మొత్తంగా ఇప్పటి వరకు 150 కి పైగానే డ్రైవర్ల నుండి దోచుకున్నట్లుగా వారు ఒప్పుకున్నారు.ఈజీ మనీ కోసం ఇలా చేశామని ఒప్పుకున్నారు.ప్రస్తుతం ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు.పోలీసులు విచారణ జరుపుతున్నారు.