సాహితీ ప్రపంచంలో భరణికి సాటివరు లేరని, తెలుగు భాష ఔన్నత్యానికి పట్టం కట్టారని, విలక్షణమైన నటుడుగా రచయితగా ప్రఖ్యాతగాంచిన భరణకి కళల కాణాచి తెనాలిలో సత్కారం గొప్ప గొప్ప విషయమని ప్రముఖ నటుడు సాయికుమార్ అన్నారు.గుంటూరు జిల్లా తెనాలి లో తెనాలి రామలింగ కళా పీఠం ఆధ్వర్యంలో సినీ నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణకి ఆత్మీయ సత్కారం నిర్వహించారు.
సత్కార సభకు శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ తెనాలి రామలింగడు ఈ ప్రాంతంలో నడియాడడం గొప్ప విషయమని ఎక్కడా జరగనటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ శతాబ్ద ఉత్సవాలు తెనాలిలో అంగరంగ వైభవంగా జరగడం కళావైభవానికి ప్రతీకని అదే గెడ్డపై సత్కారం పొందటం సంతోషమని అన్నారు.అమ్మ భాష తెలుగు భాష అంతరించిపోకూడదన్నారు.
భాష భావం రెండు కలబోసిన అందం తెలుగుదనం అన్నారు.సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సినీ మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ అజో విభో కందకలం అధ్యక్షులు అప్ప జోస్యల సూర్యనారాయణ వేమూరి విజయభాస్కర్లు పాల్గొన్నారు.