పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అడ్మిన్ వేధింపులు తాళలేక వాలంటీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.తాడేపల్లిగూడెం పట్టణ 11 వార్డు సచివాలయం వాలంటీర్ సిరా సాయిలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.అడ్మిన్ నాగబాబు లైంగికంగా వేధిస్తున్నాడని.
తాను చెప్పిన మాట వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది.