భారత్ లో క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు.మహిళలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కు గురవుతున్నారు.
ఈ క్రమంలో క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు దేశంలో తొలిసారిగా వ్యాక్సిన్ ను విడుదల చేశారు.ఢిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను విడుదల చేశారు.
క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీన్ని 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలకు వ్యాక్సిన్ అందించనున్నారు.
గర్భాశయ క్యాన్సర్ 90 శాతం వరకు నిర్దిష్టమైన వైరస్ వల్ల వస్తుందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ ఎన్కే.అరోరా తెలిపారు.
ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ కు వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు.