పాకిస్థాన్ లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. 20 మంది సజీవ ద‌హనం

పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.పంజాబ్ ప్రావిన్స్ లోని జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంక‌ర్ ను వెనుక నుంచి బ‌స్సు ఢీకొట్టింది.

 A Terrible Road Accident In Pakistan 20 People Were Burnt Alive , Burnt Alive, B-TeluguStop.com

దీంతో భారీగా మంటలు చెల‌రేగ‌గా, 20 మంది ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

కరాచీ నుంచి లాహోర్ వెళ్తుండ‌గా ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

అయితే, ప్ర‌మాదంలో కొందరి మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంతగా కాలిపోయాయి.

దీంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి, దాని ద్వారా గుర్తిస్తామ‌ని అధికారులు తెలిపారు.బ‌స్సు డ్రైవ‌ర్ నిర్లక్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

మ‌రోవైపు బ‌స్సు ద‌గ్ధం ఘ‌ట‌న‌పై పాక్ ప్ర‌ధాని షేబాజ్ ష‌రీఫ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube