ఈ మధ్య చిన్న చిన్న గొడవలుకి కొందరు మనసులో పెట్టుకొని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.అయితే ఇకపోతే తాజాగా కర్నూలు జిల్లాలో ఉన్న ఆత్మకూరు మండలంలోని బైర్లూటి గూడెం కు చెందిన బయన్న అనే వ్యక్తి పై తన అల్లుడు బాణం తో దాడి చేసిన సంఘటన జరిగింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… బైర్లూటి గూడెంకు చెందిన బయన్న వ్యక్తికి మొత్తం అయిదు మంది కుమార్తెలు.అందులో మొదటి నలుగురు కుమార్తెలకు వారి గూడెం లో ఉన్న యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.
కాకపోతే చివరి కుమార్తెను ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కుర్ర పలువురు గ్రామానికి చెందిన ఉత్తనూర్ చిన్నోడికి ఇచ్చి వివాహం జరిపించాడు.కొన్ని రోజులు బాగున్నాయా ఆ తర్వాత చిన్నోడు మద్యానికి బానిసై తన భార్యను వేధించడంతో ఆ విషయాన్ని తన తండ్రికి తెలిపింది కుమార్తె.
అయితే ఈ విషయంలో పెద్దమనుషుల జోక్యం చేయించాడు బయన్న.
ఈ అవమానాన్ని భరించలేని అల్లుడు తనతో తెచ్చుకున్న విల్లు తో ఏకంగా తన మామ పై బాణం తో దాడి చేశాడు.
ఆ దాడిలో బాణం సరాసరి మామ ఛాతి లోకి వెళ్ళిపోయింది.దీనితో స్థానికులు ఆయన్ని ఆత్మకూరు లోని హాస్పిటల్ కు తీసుకొని రాగా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
దీనితో పోలీసులు కేసు విచారణ నిమిత్తం ముందుగా కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడుతున్నారు.అలాగే నిందితుడైన అల్లుడిని పోలీసులు వెతుకుతున్నారు.