డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కథతో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాని ఏకంగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి.ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునేని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇక సినిమా కోసం హాలీవుడ్ టెక్నికల్ టీంని దర్శకుడు నాగ్ అశ్విన్ రంగంలోకి దించుతున్నాడు.
ఇక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.సినిమాకి సంగీత దర్శకులగా చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ పైనల్గా చిత్ర బృందం రెహ్మాన్ ఎంచుకున్నట్టు టాక్.
రెహమాన్ కి ఇప్పటికే హాలీవుడ్ సినిమాలకి కూడా చేసిన అనుభవం ఉండటంతో అతను అయితేనే పెర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కోసం అతనికి 4 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని కూడా ఇవ్వబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా రెహమాన్ బాలీవుడ్ లో మాఫియాపై తీవ్ర వాఖ్యలు చేసారు.ఎప్పుడు సైలెంట్ గా తనపని తాను చేసుకొని పోయే రెహమాన్ ఇలా కామెంట్స్ చేయడం బీటౌన్ లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అతని విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.ఇలాంటి సమయంలో ప్రభాస్ ప్రాజెక్ట్లోకి రెహ్మాన్ ఎంట్రీ ఇవ్వడం వల్ల మరిన్ని అంచనాలు పెరిగాయి.టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో రూపొందబోయే ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి విలన్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.