ప్రస్తుతం బాలీవుడ్ చిత్రపరిశ్రమలో రెండు వర్గాలు ఆధిపత్య పోరు జరుగుతుంది.సుశాంత్ మరణం తర్వాత చాలా మంది బీటౌన్ లో మాఫియాగా తయారైన కొంత మందిపై నేరుగానే విమర్శలు చేస్తున్నారు.
సుశాంత్ ని బ్యాన్ చేసి పరోక్షంగా ఆయన ఆత్మహత్యకి ఆ మాఫియానే కారణం అంటున్నారు.ఇక కాంగానా అయితే ఈ మాఫియాపై సుదీర్ఘ పోరాటం చేయడానికి సిద్ధమైంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బాలీవుడ్ మాఫియాపై సంగీత దర్శక దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంచలన వాఖ్యలు చేశారు.బాలీవుడ్ లో తనకు రావాల్సిన అవకాశాలను ఓ గ్యాంగ్ అడ్డుకుంటోందని ఆరోపించారు.
తనకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపచేస్తూ, సినిమాలు తనవరకు రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.
సకాలంలో బాణీలు ఇవ్వడంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ ముఠానే కారణమని అన్నారు.
సుశాంత్ రాజ్ పుత్ దిల్ బేచారా చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందని, రెహమాన్ వద్దకు వెళ్లొద్దని ఆ చిత్ర దర్శకుడు ముఖేశ్ ఛాబ్రాకు పలువురు చెప్పారని, కానీ ఛాబ్రాకు 48 గంటల్లో 4 పాటలకు ట్యూన్లు ఇచ్చానని రెహమాన్ తెలిపారు.కావాలనే ఆ మాఫియా తనని టార్గెట్ చేస్తూ ఉన్నారని, వారు ఎవరనే విషయం కూడా తనకి తెలుసని పేర్కొన్నారు.
తాను మంచి సినిమాలను ఎప్పుడూ వదులుకోవాలని భావించలేదని, మ్యూజిక్ లవర్స్ తననుంచి ఎంతో ఆశిస్తుంటే ఓ గ్యాంగ్ అందుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రేడియో మిర్చి ఎఫ్ఎం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రెహమాన్ వాఖ్యలతో ఇప్పుడు బాలీవుడ్ జరుగుతున్నా బంధుప్రీతి సెగ మరింత వేడెక్కింది.