ఎన్నికల కోడ్ అమలులు ఉన్నందున క్యాబినెట్ భేటీ నిర్వహణ పై సి ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది తో భేటీ అయ్యారు.
అలానే ఈ సమావేశం లో సి ఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీ ఏ డీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.ఈ నెల 10 న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులు ఉన్నందున ఈ సమావేశం నిర్వహించాలా వద్ద అన్న దానిపై సమాలోచనలు చేసారు.
అయితే ఈ నెల 10 న కేబినెట్ నిర్వహణ అనుమానమే అని సి ఎస్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే కేబినెట్ నిర్వహణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.అజెండాలో అంశాలపై ఈసీఐ కు 48 గంటల ముందు సమాచారం ఇవ్వాలని, అజెండా లో ఎయె అంశాలు పెట్టాలన్నది సి ఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని, దాన్ని బట్టి అసాధారణ పరిస్థితులు ఉంటె కేబినెట్ నిర్వహణకు అనుమతి ఉంటుంది అని సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈసీఐ అనుమతి ఇస్తేనే ఈ సమావేశం ఉంటుంది అని ఆయన తేల్చి చెప్ప్పారు.
.