అగ్రరాజ్యం అమెరికాలో తెలుగమ్మాయి రికార్డ్ సృష్టించింది.తన ప్రతిభాపాటవాలతో ఏకంగా 17 లక్షల బహుమతి అందుకుంది.
ఆమె గుర్తింపు పొందటానికి గల కారణాలలోకి వెళ్తే.పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రీతి మామిడాల అనే తెలుగమ్మాయి ఓ ఆవిష్కరణ చేసింది.
రీజనరాన్ సైన్స టాలెంట్ సెర్చ్ లో ప్రీతి తో సహా మరి ముగ్గురు భారత సంతతి మహిళలు సైతం ఈ గుర్తింపు పొందారు.
ప్రతీ సంవత్సరం హైస్కూల్ సీనియర్ విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష నిర్వహిస్తున్నారు.
అమ్డులూ భారత దేశంలో శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యం ప్రీతిని ఆలోచింప చేసింది.దాంతో ప్రీతి పునరుత్పాదక ఇంధనాన్ని ఎలా చేయాలో పరిశోధించింది.
ఇందుకు గాను ఉపయోగించే ఫ్యూయల్ సెల్ లోని ఉత్ప్రేరకంపై ఆమె బాగా అధ్యయనం చేసింది.ఉత్పత్తి దశలోనే శక్తిని నిల్వ చేసి, అవసరం అనుకున్నప్పుడు వినియోగించుకునేందుకు తన ఆవిష్కరణ దోహదపడుతుందని ఆమె పరిశోధించి తెలిపింది.అంతేకాదు అంజలి అనే మరొక విద్యార్ధిని బావి నీటిలో కేన్సర్కు కారణమయ్యే ఆర్సెనిక్ అవసేశాకు గుర్తించే సెన్సార్ ని తయారు చేసింది.