ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వరకు రెండు అగ్రకులాల నడుమ ఉంటాయన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మూడో… సామాజిక వర్గం రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నా గాని విజయవంతంగా ఎవరు రాణించలేక పోతున్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో అధికారం కొందరికి అన్న తరహాలో రాజకీయాలు మారిపోయాయి.ఇప్పటివరకు కేవలం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రిగా పాలించడం జరిగింది.
ఇంకా ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోంది.పరిస్థితి ఇలా ఉంటే మహమ్మారి కరోనా వైరస్ రెండోసారి వచ్చిన సమయంలో.
సెకండ్ వేవ్ లో.వైద్య కొరత ఏర్పడటం తెలిసిందే.
సెకండ్ వేవ్ దాటికి దేశంలో చాలా రాష్ట్రాలు ప్రభుత్వాలు.అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటు వైద్యుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య కరోనా నాటు మందు.చాలా మంది ప్రాణాలను కాపాడటం తెలిసిందే.ఈ మందుతో ఆనందయ్య పేరు దేశవ్యాప్తంగా మాత్రమేకాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.ఇదిలా ఉంటే తాజాగా ఆనందయ్య ఇటీవల అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పేరుగాంచిన పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయి అని, త్వరలోనే బీసీ జేఏసీతో కలుపుకొని కొత్త బీసి పార్టీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య చెప్పుకొచ్చారు.
దీంతో ఆనందయ్య చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.