ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం, చేతిలో స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది.గంటల కొద్దీ సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ తోనే వారి సమయాన్ని గడిపేస్తున్నారు.
ఈ తరుణంలో చాలా మంది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అవి కాస్త ట్రెండ్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.ఇక ఎప్పుడు సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉండే మహేంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆర్కిటిక్ ఐడియాను పొగుడుతూ పోస్ట్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటో.సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు తన ఆటోరిక్షా ను పూర్తిగా మొబైల్ హోమ్ గా మార్చుకున్నాడు.అందుకు సంబంధించిన ఫోటోను ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ వేదికగా.“అరుణ్ తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని ఎలా సృష్టించాలో నిరూపించాడు” అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసారు.
కానీ, ఇది ఒక పెద్ద ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని.నిజానికి ఈ మొబైల్ హోమ్ ను ప్రదర్శన కోసం ఉంచాలని ఆనంద్ మహేంద్ర కోరాడు.ఈ కరోనా వైరస్ సమయంలో ఎవరైనా మనల్ని ఇలా కనెక్ట్ చేయగలరా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఏదేమైనా కానీ ఈ ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు ఐడియా సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
ఈ తరుణంలో ఆటో రిక్షాలు మొబైల్ హోమ్ గా నిర్మించాడనికి లక్ష రూపాయలు ఖర్చయిందని తెలియజేశారు.ఏది ఏమైనా ఐడియా అదుర్స్ కదండీ.!
.