తల్లిని మించిన దైవం లేదు.ఎవరినైనా సృష్టిలో పూజించాలంటే ముందుగా తల్లి తర్వాతే, ఆ దేవుడైన తల్లి తర్వాతే.
దానికి కారణం తల్లి తన పిల్లల కోసం ఎంత కష్టం అయినా భరిస్తుంది.అలా తన కొడుకు జైల్లో ఉండటం భరించలేకపోయిన ఒక తల్లి, ఎలాగైనా సరే తన కొడుకుని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసింది.
అందుకోసం ఏకంగా భారీగా ఒక సొరంగ మార్గనే తవ్వేసింది.ఆ తర్వాత తన కొడుకును రక్షించే క్రమంలో పోలీసుల చేతిలో అడ్డంగా పట్టుబడింది తల్లి.
ఇక తన కొడుకు కోసం చేసిన ఆ పనికి తల్లికి కోర్టు శిక్ష విధించింది.ఈ సంఘటన ఉక్రెయిన్ దేశంలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళితే… ఉక్రెయిన్ లోని జఫోరిజియా ప్రాంంతంలో.ఒక నేరం కేసులో ఓ వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది.
దింతో ఓ తల్లి తన కొడుకు జైలుపాలు అవ్వడంతో ఎంతగానో బాధతో కుమిలిపోయింది.ఈ తరుణంలోనే ఒక రోజు కొడుకుని చూసేందుకు జైలు కి వెళ్ళింది.
అలా కలిసిన ఆమెను, కొడుకు తన తల్లికి ఒక ప్లాన్ చెప్పాడు.ఇక చెప్పిందే తడవు దీనితో వెంటనే మరుసటిరోజు జైలు కు సమీపంలో ఒక ఇంటిని ఆ తల్లి అద్దెకు తీసుకొని ఆ ఇంట్లోకి చేరుకుంది.
ఉదయం పూట మొత్తం ఇంట్లోనే ఉంటూ… రాత్రి సమయంలో మాత్రం జైలు దగ్గరగా నిర్మానుష్య ప్రాంతానికి చేరి అక్కడ సొరంగ మార్గం తవ్వడం మొదలుపెట్టింది.ఇలా ఏకంగా మూడు వారాలపాటు తవ్వి మొత్తం 35 అడుగుల సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసిందంటే నమ్మండి.అవును, ఇదంతా ఆ తల్లి తన కొడుకును జైలు నుండి తప్పించే క్రమంలో పోలీసుల చేతిలో పట్టుబడింది.ఇంకేముంది ఆ తరువాత జరిగిన విచారణలో ఈ విషయాలన్నీ ఆమె పోలీసులకు తెలియజేసింది.
ప్రపంచంలో ఏదైనా కల్తీ లేదంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే.