ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరమూ చెప్పలేం.ఇది వచ్చిందంటే ప్రాణాలను బలి తీసుకోవడమే జరుగుతుంది.
దీన్ని తప్పించుకోవడం చాలా కష్టం.మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అది అనుకోని రీతిలో వస్తుంది.
అలాంటి సమయంలో మన అదృష్టం బాగుంటేనే దాని నుంచి బయటపడుతాం.లేదంటే మాత్రం దానికి బలైపోతుంటాం.
ఇక వరదలు వచ్చినప్పుడు చాలామంది నగరాల్లో తెలియక మ్యాన్ హోళ్లలో లేదంటే నాలాల్లో పడిపోతున్న ఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం.హైదరాబాద్ లాంటి నగరాల్లో మొన్నటికి మొన్న ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
కాగా ఇప్పుడు ఓ మహిళ చేసిన పొరపాటు చివరకు ఆమె ప్రాణాలనే కాకుండా తన బిడ్డ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసింది.మనలో చాలామందికి ఫోన్లు అంటే ఎంత పిచ్చో తెలిసిందే.
ఎక్కడున్నా సరే ఫోన్ పట్టుకుని ఉండకపోతే మనకు అస్సలు టైమ్పాస్ కాదు కదా.ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు ఓ మహిళను డేంజర్లో పడేసింది.
ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఓ మహిల రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నట్టు కనిపిస్తుంది.ఆమె ఓ చేతిలో బిడ్డను ఎత్తుకుని ఇంకో చేత్తో ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుకుంటూ వెళ్తోంది.
కానీ ఇలా వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న మ్యాన్ హోల్ ను ఆమె గమనించలేదు.పైగ ఆ మ్యాన్ హోల్ పై మూత కూడా లేకపోవడంతో ఆమె చూసుకోకుండా దానికి దగ్గరగా వెళ్లింది.దీంతో అడుగు తప్పి అందులో బిడ్డతో సహా ఆమె పడిపోయింది.కానీ అక్కడే ఉన్న స్థానికులు ఇదంతా గమనించి వెంటనే వారిని మ్యాన్ హోల్ నుంచి బయటకు తీసుకుందుకు ఏకమయ్యారు.
ఎలాగైనా ఆ తల్లీ బిడ్డలను కాపాడేందుకు వారు ఒక్కటై వారిని సురక్షితంగా బయటకు తీసి కాపాడారు.దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైలర్ అవుతోంది.
.