అప్పుడప్పుడు రాత్రి పూట ఇంట్లోకి ఏవైనా పాములు లేదంటే సరీసృపాల్లాంటివి ఇంట్లోకి రావడాన్ని మనం చూస్తుంటాం.ఇలాంటప్పుడు మనం నేల మీద పడుకుని గనక ఉంటే ఇక అంతే సంగతులు.
వాటి కాటుకు బలైపోతుంటాం.ఇప్పటికే ఇలా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం వింటున్నాం.
కానీ కొన్ని సార్లు బెడ్ మీదనో లేదంటే మంచం మీదనో పడుకుంటే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు.ఎందుకంటే అవి రాత్రి పూట నేల మీదనే పాకుతాయి గానీ పైకి ఎక్కేందుకు ప్రయత్నించవు.
ఇప్పుడు కడూ ఇలాంటి ఘటనే జరిగింది.
నిజానికి కుటుంబం పెద్దదయి ఇల్లు చిన్నగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
మరీ ముఖ్యంగా రాత్రి పడుకునేందుకు పెద్దగా ప్లేస్ ఉండక చివరకు కింద పడుకోవాల్సి వస్తుంది.ఎందుకంటే ఇంట్లో మంచాలు లేదంటే బెడ్లు వేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు.
ఇలా కింద పడుకునేసమయంలో ఏవైనా ఇంట్లోకి వస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం.ఇప్పుడు కూడా ఓ పెద్ద కుటుంబానికి ఇలాంటి ఘటనే ఎదురైంది.
బ్యాంకాక్ కు చెందిన ఓ కుటుంబం ఇంటి నేలపై పడుకున్నారు.అయితే వారి పక్కన పడుకున్న పాప మాత్రం ఇంకా టీవీ చూస్తూ ఉంది.
ఇంతలోనే వారి ఇంట్లోకి ఉడుము ఎంట్రీ ఇచ్చింది.ఎవరో తరుముతున్నట్టు వేగంగా వచ్చి వారి పక్కనుంచి లోపలకు వెళ్లింది.అయితే వారు మాత్రం దాన్ని పట్టించుకోకుండా అలాగే పడుకుని ఉన్నారు.కానీ చిన్నారి చూసి భయంతో కేకలు వేసింది.దీంతో పడుకున్న వారు లేచి ఏమైందని అడగ్గా పాప సైగలు చేసి మానిటర్ బల్లి గురించి వివరిస్తుంది.వారంతా వెంటనే కర్రల సాయంతో ఇంట్లోకి వెళ్లిన ఉడుమును బయటకు తరిమేయడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు.
కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.