చాలా మంది మహిళలు భర్త వేధిస్తున్నాడనో, అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడనో లేకపోతే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనో కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకోవడం తరచూ చూస్తూ ఉంటాం.కాకపోతే ఇప్పుడు కొత్తగా తన భర్త బిర్యాని కొనివ్వలేదని చిన్న కారణంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే.ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం నగరంలో జరిగింది.
నగరంలో మనోహర్, శరణ్య వారి 11 ఏళ్ళ కొడుకు, మరో 9 ఏళ్ళ కూతురు జీవనం కొనసాగిస్తున్నారు.అయితే అతను స్థానికంగా ఓ శిల్పాల తయారీ సంస్థలో రోజు కూలీగా పని చేస్తుండేవారు.
అయితే వీరిద్దరికీ పెళ్లి అయినప్పటినుంచి మనోహర్ తన భార్య కు ఇంట్లో ఉండే బిర్యానీ కంటే హోటల్ నుంచి తెచ్చిన బిర్యానీ ఎక్కువ ఇష్టపడుతుండంతో ఇంటికి బిర్యాని తీసుకు రావడం మొదలు పెట్టాడు.అయితే తాజాగా తన భార్య బిర్యానీ అడగగా భర్త ప్రస్తుతం పనులు లేకపోవడంతో డబ్బులు అంతంతమాత్రంగానే ఉండడంతో మరోసారి కొనిస్తానని చెప్పి బయటికి వెళ్లిపోయాడు.
భర్త అలా చెప్పడంతో భార్య మనస్థాపం చెంది ఇంటి బయట పార్క్ చేసి ఉన్న భర్తపై బైక్ దగ్గరికి వెళ్లి అందులోంచి పెట్రోల్ ని తీసుకుంది.
ఆ తర్వాత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.ఈ సంఘటన గమనించిన ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పేశారు.ఆ తర్వాత భర్తకు సమాచారం అందించడంతో స్థానికుల సహాయంతో భర్త తన భార్య ని మహాబలిపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య ప్రాణాలు కోల్పోయింది.తన భార్య ఇలాంటి పని చేస్తుందని అసలు ఊహించలేదని భర్త, తన పిల్లలు కంటతడి పెట్టారు.
ఇరుగుపొరుగు వారు కూడా ఇంత చిన్న కారణానికి శరణ్య ఇలా చేయడాన్ని చూసి వారు విస్తురపోయారు.