నేరం చేసిన వారికి శిక్ష పడాలని ఎవరైనా కోరుకుంటారు.కానీ న్యాయ వ్యవస్థలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయి.
చాలామంది నేరగాళ్లు బయటే తిరగడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం.అయితే నేరగాళ్లు కొన్ని సార్లు జైలుకు వెళ్లినా కూడా ఇంకొన్ని సార్లు బెయిల్ మీద బయట తిరుగుతుంటారు.
అయితే ఏ తప్పు చేయకున్నా కూడా కొందరు జైళ్లలో గడుపుతుండటం మనం చాలా సార్లు చూస్తుంటాం.ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి గురించే మీకు చెప్పబోతున్నాం.
అయితే ఇతనికి జరిగిన విషయం తెలిస్తే మాత్రం అయ్యో పాపం అనక మానరేమో.
ఏ తప్పు చేయని వ్యక్తికి శిక్ష అంటే ఒకటి లేదా రెండేండ్ల వరకు శిక్ష అనుకుంటున్నారు కదా.
అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే.అతను ఏకంగా 43 ఏళ్ల వరకు జైలులోనే గడిపేశాడు.
ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.ఏ తప్పు చేయకపోయినా ఇన్నేండ్లు ఎలా జైలులో ఎలా ఉంచుతారంటూ చాలామంది మండిపడుతున్నారు.
కెవిన్ అనే వ్యక్తి ఒకానొక సమయంలో ముగ్గురి హత్య కేసులో దోషిగా జైలు శిక్ష ఎదుర్కొన్నాడు.అయితే ఇన్నేండ్లుగా అతను జైలులోనే ఉండగా.
తాజాగా కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
ఓ ఇంట్లో ముగ్గురిని కొందరు దుండగులు దాడి చేసి చంపేయడంతో ఆ సమయంలో ఇంట్లో ఉన్న సింతీయ ఆ దాడి నుంచి తప్పించుకుని తన ప్రాణాలను నిలబెట్టుకుంది.అయితే ఆమె కెవిన్ పేరును చెప్పడంతో వారు ఆయన్ను అరెస్టు చేశారు.అయితే కొన్నాళ్ల తర్వాత నిజం తెలిసినా అబద్ధం చెప్పినందుకు తనకు ఎక్కడ శిక్ష పడుతుందో అని ఆమె చెప్పలేదు.
ఇన్నేండ్ల తర్వాత స్థానిక ప్రాసిక్యూటర్ ఈ కేసు మీద మళ్లీ పిటిషన్ వేయడంతో కెవిన్ నిర్దోషిగా బయట పడ్డాడు.దాదాపు ఆయన యవ్వనం మొత్తం జైలులోనే గడిపేశారు.