సాదారణంగా మనుషులకు కుక్కలు, పిల్లులు పెంపుడు జంతువులుగా ఉంటాయి.ఇక రేర్గా పులులు, పందులు ఇతరత్ర చిత్రమైన జంతువులను కూడా పెంచుకుంటారు.
ఆ జంతువులతో మనుషులు మచ్చిక చేసుకుని స్నేహంగా మెలిగిన సందర్బాలు మనం ఎన్నో చూశాం.చివరకు డాల్ఫిన్స్తో కూడా మనుషులు మచ్చిక చేసుకుని ఆడుకున్న సందర్బాలు ఉన్నాయి.
కాని చేపలతో మనుషులు మచ్చిక చేసుకున్న సందర్బాలు మనం ఇప్పటి వరకు చూడలేదు.ప్రపంచంలో ఇప్పటి వరకు చేపలతో సహవాసం చేసిన వ్యక్తి కేవలం ఈ పెద్దాయన మాత్రమే.
ఈ పెద్దాయనది ప్రపంచంలో ఎక్కడో మారుమూల ప్రాంతం ఏమీ కాదు.మన ఇండియాకు చెందిన బెంగాళీ ఇతడు.ఇతడికి చేపలు స్నేహితులు.రోజుకు ఒకటి రెండు సార్లు ఒడుకు వచ్చి ఈయన్ను కలిసి వెళ్తూ ఉంటాయి.ఆ సమయంలో వేరే ఎవరినైనా చూస్తే అవి వెంటనే వెనక్కు వెళ్లి పోతాయి.ఆ పెద్దాయనకు అవి ఎంతగా స్నేహం అయ్యాయి అంటే అతడు పిలిస్తే వచ్చేంతగా సన్నిహితం అయ్యాయి.
మామూలుగా మనం అయితే చేప కనిపిస్తే చాలు వండేసుకునేందుకు పట్టేసుకుంటాం.కాని ఆయన మాత్రం వాటిని ఎంతో అపురూపంగా నిమిరుతూ వాటికి దానా వేస్తాడు.
ఒక రోజు ఒడ్డున కూర్చుని దానా వేస్తుండగా ఒక చేప వచ్చింది.అలా ఆ చేయ అతడికి సన్నిహితం అయ్యింది.కొన్ని రోజులు వరుసగా ఆ చేపకు దానా వేయడం, ఆ చేప అతడికి దగ్గర అవ్వడం జరిగింది.ఆ చేప మరికొన్ని చేపలను తీసుకు వచ్చి ఈ పెద్దాయనకు సన్నిహితం అయ్యేలా చేసింది.
అలా రోజూ చాలా చేపలు ఆ పెద్దాయన కోసం ఒడ్డుకు వస్తాయి.
ఇటీవల ఒక చేప చనిపోతే దాన్ని సాదారణంగా జంతువులు చనిపోతే ఎలా చేస్తారో అలా ఖననం చేయడం జరిగింది.ఆయన మంచి తనంతో చేపలను మచ్చిక చేసుకున్నాడు.చేపలను మచ్చిక చేసుకోవడంతో పాటు వాటితో స్నేహం చేసుకున్న ఈ వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.