నేరస్వభావం ఉన్న వారు ఎలాగైనా నేరం చేస్తారు.అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వారు సమాజంలో ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయం.
అదీగాక మనుషుల ప్రాణాలు అంటే సులువుగా చింపే కాగితాలుగా మారిపోయాయి.ఏదైన కక్ష ఉంటే దానికి చంపడం ఒక్కటే మార్గం అనే విధంగా ఆలోచిస్తున్నారు.
ఇక బీహార్, సుపాల్ జిల్లాలో దారుణం జరిగింది.ఆ వివరాలు చూస్తే.త్రివేణి గంజ్ కు చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి ,ఓ పాన్ షాప్ వద్దకు వెళ్లి రూ.20 విలువ చేసే పాన్ మసాలాను అప్పుగా ఇవ్వాలని ఆ షాపు యజమాని కోరగా అందుకు అతడు నిరాకరించాడట.దాంతో అజిత్ కుమార్, పాన్ షాప్ యజమానితో గొడవకు దిగడంతో, అక్కడే ఉన్న స్దానికులు సర్ది చెప్పడంతో మౌనంగా వెళ్లిపోయాడట.
అయితే మరుసటి రోజు అజిత్, అతని గ్యాంగ్ను వెంటేసుకుని ఆ పాన్ షాప్కు వెళ్లి తిరిగి గొడవకు దిగాడట.ఆసమయంలో షాపు యజమాని చిన్న కుమారుడు ఉండటంతో, అజిత్ అతని పై దాడికి దిగి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చడంతో, షాపు యజమాని కుమారుడు సంఘటన స్దలంలోనే మరణించాడట.
ఈ ఘటన తర్వాత నిందితులు పారిపోయారట.
ఇకపోతే సమాచారం అందుకున్న త్రివేణిగంజ్ పోలీసులు ఈ హత్యపై, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఇందులో భాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారట.