నిజమైన ప్రేమకు కృరమృగాలు సైతం కృరత్వాన్ని వదిలిన సంఘటనలు ఎన్నో లోకంలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.అలాంటిది అన్ని ఆలోచించగలిగే నేర్పరితనం ఉన్న మనుషులు మాత్రం స్వార్ధంతో కన్నవారి పాలిట శాపంగా మారుతున్నారు నేటి కాలంలో.
కానీ ఓ యువకుడు మాత్రం కన్న తండ్రి కోసం ఎంబీఏ చదివి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.ఎందుకనే వివరాలు తెలుసుకుంటే.
ఏపీలోని విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలేనికి చెందిన ఎ.మధుకిషన్ అనే యువకుడు ఎంబీఏ చదివి మంచి ఉద్యోగంలో ఉన్నాడు.కానీ ఇతని తండ్రి కరోనా కారణంగా అనారోగ్యం పాలవగా చికిత్స కోసం విశాఖలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి కేజీహెచ్లో చేర్పించారు.అయితే అక్కడ స్నానం చేస్తు పడిపోయిన ఇతని తండ్రిని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఆ విషయం తెలిసిన మధుకిషన్ తన తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు తానే స్వయంగా సేవలు అందించాలని భావించి ఆ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.
అయితే మధుకిషన్ డ్యూటీలో చేరే సమయానికంటే ముందే ఇతని తండ్రి చనిపోయాడని తెలిసింది.కాగా తన తండ్రి మరణానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసాడట.
ఇకపోతే తల్లిదండ్రులంటే శత్రువుల్లా భావిస్తున్న ఈ రోజుల్లో తన తండ్రి కోసం ఈ వ్యక్తి చేసిన త్యాగం కళ్లుమూసుకుపోయిన కొడుకులకు కనువిప్పు కలిగించాలని ఆశిద్దాం.