నేటి సమాజంలో వివాహ వ్యవస్ద అనేది ఎంగిలాకులా మారిపోయింది.ప్రేమకు ముందు ఉన్న అవగాహన, పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఆత్రుత.
వివాహం అయ్యాక వచ్చే అపార్దాలు ఇవన్నీ కూడా నేటి మనుషుల్లో కామన్ అయ్యాయి.ఆడ మగ ఇద్దరికి ఒకరికి ఒకరు కావాలి అంతే తప్పా తాము నడుస్తున్న దారి తప్పా, ఒప్పా అనే ఆలోచనే ఉండటం లేదు.
ఇక మన సనాతన భారతీయంలో వివాహ వ్యవస్థ, ఒక పటిష్ఠ పవిత్ర విధానం.దీన్ని ఈ మధ్య కాలంలో మంట కలిపేసే సంఘటనలు ఎన్నో లోకంలో జరుగుతున్నాయి.
ఏడడుగులతో ఆరంభమైన వివాహ బంధం జీవితాంతం కొనసాగలేక వివాహేతర సంబంధాలకు దారి తీస్తూ, ఒకరినొకరు చంపుకుంటున్నారు.
ఇకపోతే తాను వేసిన తప్పటడుగే ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం, చింతకుంట గ్రామానికి చెందిన దత్తు అనే వ్యక్తికి ఏడు సంవత్సరాల క్రితం వివాహం కాగా, భార్యతో మనస్పర్థలు ఏర్పడటంతో వీరిద్దరు విడిపోయారు.
కాగా గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన స్వరూప అనే మహిళతో దత్తు సహజీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో దత్తు దారుణ హత్యకు గురయ్యాడు.
అయితే ఈ మరణం పై పలు అనుమానాలు నెలకొంటున్నాయట.ఈ క్రమంలో స్వరూపనే తన కుమారుడిని హత్య చేసిందని మృతుడి తండ్రి గంగాధర్ ఆరోపిస్తున్నాడు.
ఇక ఇతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.