హెడ్ ఫోన్ లో పాటలు వింటూ చిరుతకు బలైన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో చోటు చేసుకుంది.బైపారో అటవీ ప్రాంతం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మమత అనే 8వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం తన ఇంటి వద్ద ఉన్న ఒక కాలువ ఒడ్డున కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉండగా బాలికపై చిరుతపులి హఠాత్తుగా దాడి చేసింది.
ఆ తర్వాత ఆ అమ్మాయిని అడవిలోకి లాక్కెళ్లి పోయింది చిరుతపులి.స్థానికుల సమాచారం మేరకు అటవీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అక్కడ హెడ్ ఫోన్స్, ఓ దువ్వెన లభించినట్టు వారు తెలిపారు.
అలాగే కొద్దిసేపటి తర్వాత ఆడవిలో ని పొదల్లో బాలిక మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు.
ఆ బాలిక హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం ద్వారా పులి వచ్చినట్టు గుర్తించలేకపోయింది అని అధికారులు తెలియజేశారు.
ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో చిరుత దాడిలో కేవలం ఒక్క నెలలోనే మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.అయితే ఆ క్రూర చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ఇప్పటి వరకు 7 కెమెరాలను రెండు ఫోన్లను ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఆ చిరుత బాలికను చంపిన చోటికి మళ్లీ వచ్చి కెమెరా కంటికి దొరికింది.
ఇకపోతే అక్కడే ఉన్న బోను దగ్గరికి వచ్చినప్పటికీ గ్రామస్తుల అలికిడి వలన అది మల్లి పారిపోయినట్టు అధికారులు తెలిపారు.
అయితే మరోసారి తన పట్టుకునేందుకు బోను మరో ప్రాంతానికి మారుస్తామని అధికారులు తెలియజేశారు.ఇకపోతే పోస్టుమార్టం తర్వాత అమ్మాయి శవాన్ని ఆ పాప బంధువులకు అందించారు.
అంతేకాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి మూడు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు.