వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.అసలే రాజకీయం అంటే రాబంధులు, జరాసంధిలు, కీచకులు, మానాభిమానాలు విడిచి చేసేదనే అభిప్రాయం ప్రజల్లో ఉందట.
అదీగాక ఎక్కువమంది ఉన్న సామాన్య ప్రజలకు ఎంగిలి మెతుకులు విసిరి, తక్కువ మంది ఉన్నా రాజకీయ నాయకులు విందు భోజనాలు చేయటమే నేటి రాజకీయం.
ప్రజల అవసరాలు తీర్చడం కోసం కాదు నేతలు రాజకీయాల్లోకి వచ్చేది.
సేవ అనే ముసుగులో వారి అవసరాలు తీర్చుకోవడానికి అని ఈ పిచ్చి జనానికి ఎప్పటికి అర్ధం కాదని అనుకుంటున్నారట కొందరు.
ఇకపోతే వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం పరిధిలోని 12 విడివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన, జూలూరి శ్రీధర్ పార్టీ మారిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫలితం ఎలా వస్తుందో రాదో కూడా తెలుసుకోక ముందే ముందస్తుగానే టీఆర్ఎస్ పార్టీలోకి జంపింగ్ జపాంగ్ చేశాడట.
కాగా స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్టీ పదవుల్లో సముచితస్థానం కల్పిస్తాననే హామీతో శ్రీధర్ పార్టీ మారినట్లుగా తెలుస్తోంది.అయితే ఫలితాలు వెల్లడికాకముందే పదవుల మీద ఉన్న ఆశతో ఇలా జంప్ అవుతున్న అభ్యర్థులు ఇక ప్రజలకు సేవ ఏం చేస్తారో ఒక్క సారి ఓటర్లు గమనించవలసిందిగా కొందరు కోరుతున్నారట.