చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.యాదగిరి మండలం మోర్ధానపల్లె సమీపంలో అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.
ఈ పరిణామంతో మంటలు ఉవ్వెత్తున ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఫ్యాక్టరీలో కార్మికులు… పరుగులు పెట్టడం జరిగింది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునీ మంటలను అదుపు చేస్తున్నారు.
అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.
భారీగా అగ్ని కీలలు ఎగిసి పడుతూ ఉండటంతో ఫైర్ సిబ్బంది…మంటలు దుపు చేయటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ ఆస్తి నష్టం భారీగా వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
భారీ అగ్ని ప్రమాదం కావడంతో ఘటన జరిగిన చుట్టుప్రక్కల ప్రాంతాల వరకు కొన్ని కిలోమీటర్లు దట్టమైన పొగలు వ్యాపించాయి.