తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటిగా అక్కడి తెలుగు వారిలో ఎంతో ఆదరణ సంపాదించుకుంది.ఈ సంఘానికి అధ్యక్షులు అయిన సతీష్ వేమన సంస్థని ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
ఈ క్రమంలోనే తానా 22 వ మహాసభలని పురస్కరించుకుని.అధ్యక్షులు సతీష్ వేమన అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగు వారి వద్దకి వెళ్లి సభల నిర్వహణకి నిధులు సేకరిస్తున్నారు.
ఈ సంధర్భంలోనే జులై 4,5,6 తేదీల్లో నిర్వహించబోయే మహాసభల నిర్వహణ నిధుల కార్యక్రమాన్ని డెట్రాయిట్లో నిర్వహించారు.దాంతో స్థానిక ప్రవాసులు దాదాపు 3కోట్లు రూపాయల విరాళాలు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి సతీష్ వేమనతో పాటు సభల చైర్మన్ డా.కొడాలి నరేన్లు కూడా హాజరయ్యారు.ఇంతటి భారీ సంఖ్యలో నిధులు అందించినందుకు డెట్రాయిట్ ప్రవాసులకి ధన్యవాదాలు తెలిపారు.
తానా 22వ మహాసభలను ప్రవాసులు, తెలుగు వారందరూ ఆశ్చర్యపడేలా భారీగా నిర్వహిస్తామని, ఈ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయని సతీష్ వేమన తెలిపారు.తానా ప్రాంతీయ ప్రతినిధి పంత్ర సునీల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ తాన అధ్యక్షుడు బండ్ల హనుమయ్య కూడా పాల్గొనారు.
.