మనుషులకు వున్న జ్ఞానం మరే ఇతర జీవికి విండదన్నది నిర్వివాదాంశం.మనుషులకే ఆకలి వేస్తే తమకి ఇష్టమైన, సరిపడిన ఆహారాన్ని తీసుకుంటారు.
అదే మూగ జీవాలు అయితే తన కంటికి కనబడిన వాటిని తింటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి.ఒక్కోసారి కొన్ని జీవులు కొన్ని రకాల విషపదార్ధాలు తిని ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి.
ఇటీవల కొన్ని మేకలు విషపూరితమైన ఆకులు తిని ప్రాణాలు పోయిన ఘటనను మనం చూసాం.అయితే తాజాగా ఓ కొండ చిలువ ఆకలిని తాళలేక ఓ భారీ టవల్ ని మింగేసి తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యింది.
ఆ టవల్ను జీర్ణం చేసుకోలేక నయయతన పడింది.ఇక దాని అవస్థను గుర్తించిన కొందరు స్థానికులు డాక్టర్లను పిలిచారు.వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్లోని ఓ కొండ చిలువ ఆకలిని తట్టుకోలేక ఓ టవల్ను మింగేసింది.ఆ తర్వాత దానిని జీర్ణం చేసుకోలేక, బయటకు కక్కలేక నానా అవస్థలు పడటంతో గమనించిన స్థానికులు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు.
దాంతో వారు దానిని జంతువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే దాని పరిస్థితి విషమంగా మారింది.
దాంతో వైద్యులు అప్రమత్తమై ఆ కొండ చిలువకు మత్తు మందు ఇచ్చి అనంతరం దాని కడుపులోకి ఓ టూల్ పైప్ను పంపి.అతి కష్టం మీద ఆ టవల్ను బయటకు లాగారు.
దీంతో ఆ కొండ చిలువ ప్రాణాలతో బయటపడింది.ఆ తరువాత దానిని అడవిలో వదిలేసారు.
ఆపై అది వారిని కృతజ్ఞతగా చూస్తూ అక్కడినుండి వెళ్ళిపోయింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా వెలుగు చూసింది.
సదరు వీడియో యూట్యూబ్ లో Lets Make It Viral LMIV అనే ఛానల్ లో అప్లోడ్ చేసారు.ఇప్పటివరకు దానిని వేలమంది తిలకిస్తున్నారు.
ఒకసారి మీరు కూడా తిలకించి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.