తెలుగు సిని దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్.మొదటగా గమ్యం సినిమా కు దర్శకత్వం వహించగా.ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.అంతేకాకుండా ఉత్తమ దర్శకుని నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె వంటి సినిమాలలో దర్శకత్వం వహించారు.
బాలీవుడ్ లో కూడా కంగనారనౌత్ తో మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా దర్శకత్వం వహించారు.ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే.2016 ఆగస్టు 7 న రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల రెండేళ్ళకే విడిపోయారు.అప్పట్లో ఈ విషయం బాగా చర్చగా మారింది.ఇక తాము విడిపోవడానికి ఎటువంటి కారణాలు ఆ సమయంలో బయటకు తెలియక పోగా..ప్రస్తుతం ఈ విషయం మళ్లీ చర్చనీయాంశం గా మారింది.
కానీ క్రిష్ తన భార్యతో విడిపోవడానికి కారణం.ఓ హీరోయిన్ కారణమని తేలింది.తన దర్శకత్వంలోనే నటించిన ఓ హీరోయిన్ తో.క్లోజ్ గా ఉండేవాడట.ఇక ఆ విషయం తెలుసుకున్న తన భార్య రమ్య ఆయనను పలుమార్లు హెచ్చరించిందట.
ఇక అతడు మళ్లీ అలాగే చేయడంతో చివరికి అతని దగ్గర నుండి విడాకులు కోరిందని.దానికి క్రిష్ కూడా సిద్ధం అవ్వగా.ఇద్దరూ విడిపోవడానికి సిద్ధమయ్యారట.
2018 లో కోర్టును ఆశ్రయించి కోర్టు విడాకులు మంజూరు చేసి విడిపోగా.ఇప్పటివరకు ఆ హీరోయిన్ ఎవరని.పేరు బయట పడకపోగా ఇంతకీ ఏ సినిమా దర్శకత్వంలో జరిగిందని బాగా చర్చలు ఎదురయ్యాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్.పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.