అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని కామయ్యపేట జంక్షన్ వద్ద రెండు వందల కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ముంచంగిపుట్టు మండలంలోని కొండపడకు చెందిన స్మగ్లర్ గణేష్.
మహారాష్ట్రకు చెందిన ముఠాతో కలిసి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో కామయ్యపేట జంక్షన్ వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.
నిషేధిత గంజాయితో పాటు 7 ఎంఎం పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.
మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.