దళిత బంధు పధకం తెలంగాణలోనే కాక దేశం మొత్తంలో కూడా ఒకింత సంచలనం సృష్టించేలా కనిపిస్తున్నాయి.దళితులు గత కొన్నేళ్లుగా వివక్షకు గురవుతున్నారనే అపవాదు ఉన్న విషయం తెలిసిందే.
అయితే దళితుల సంక్షేమమే లక్ష్యంగా కెసీఆర్ తీసుకవస్తున్న మరో పధకం దళిత బంధు.అయితే ఇప్పుడు హుజురాబాద్ లో ఈ పధకాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ పధకం అమలు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ దళిత బంధు అనేది ఒక కార్యక్రమం కాదని ఇదొక ఉద్యమం అని కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.
అయితే ఈ పధకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చి దళితులను ఆర్థికంగా పటిష్టం చేయాలన్నది కెసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.నేడు దళిత బంధుపై కెసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గ దళితులతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.
అయితే ఈ పధకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే దళితులు ఆర్థిక పరిపుష్టత పొందుతారనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.అయితే ఈ పధకం అమలు విధి, విధానాలు ఇంకా ప్రభుత్వం ప్రకటించకున్నా దళితుల ఆలోచనలు స్వీకరించి ప్రభుత్వం ఆలోచనలతో మిళితమై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించనున్నారు.
మరి ఈ పధకం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది.