కరోనా కాలం.మానవత్వం మంటకలిసిపోయింది.
పక్కన మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటే పది అడుగులు దూరం వెళ్తున్నారు.అదే తుమ్ముతు.
దగ్గుతూ మరణిస్తే ఆగకుండా కిలోమీటర్లు పరిగెత్తుతున్నారు.ఇంకా ఇలాంటి ఘటనలు చూస్తున్న సమయంలోనే ఇప్పుడు నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లోకి కలిసిపోయింది.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు బాధితుడు.ఇంకా విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపించాల్సిన అధికారులు దీన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.
దీంతో శ్వాస తీసుకోవడం క్షణక్షణం ఇబ్బంది పడుతూ ఆంబులెన్స్ కోసం ఎదురు చూశాడా బాధితుడు.
అయితే గంట.రెండు గంటలు కాదు ఏకంగా 4 గంటల పాటు నడిరోడ్డుపైనే మృత్యువుతో పోరాడి చివరకు చనిపోయాడు.ఆంబులెన్స్ లేట్ గా రావడంతోనే కరోనా బాధితుడు మరణించాడు.
ఇంకా ఈ విషయం తెలుసుకున్న మహానగర పాలికే కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించానని, దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.కాగా ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
.