ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా విషయంలో కూడా మంచి కన్నా చెడును చూడటం ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు.ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలతో ప్రతి సినిమా పై కేసు వేయడం లేదా సంబంధిత మతానికి సంబంధించిన వారు తమ మతాన్ని అవమాన పరిచారని సినిమాలపై కేసులు వేయడం ఎక్కువైంది.
ఇప్పటికే ఎన్నో సినిమాలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.తాజాగా ఇలాంటి ఇబ్బందులలో ఎన్టీఆర్ విలన్ ఇరుక్కున్నారు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న అదుర్స్ సినిమా ద్వారా విలన్ గా అందరినీ మెప్పించిన నటుడు మహేశ్ మజ్రేకర్ గురించి అందరికీ తెలిసిందే.
ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వం వహించిన మరాఠీ సినిమా ‘నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచా’ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల అయింది.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంది.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై ది క్షత్రియ మరాఠా సేవా సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాలో చిన్నపిల్లలను మహిళలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు దర్శకుడు మహేష్ పై మాత్రమే కాకుండా నిర్మాతలు నరేంద్ర, శ్రేయాన్స్లపై కూడా కేసు నమోదు చేశారు.ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమాలో ఎన్నో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని మహారాష్ట్ర మొత్తం మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.ఈ క్రమంలోనే వీరిపై పోలీస్ కేసు వేయడంతో ఈ కేసుపై ఫిబ్రవరి 28వ తేదీన విచారణ జరగనుంది.
దివంగత జయంత్ పవార్ రాసిన స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది ఇందులో సమాజం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొని నేరస్తులుగా మారిన ఇద్దరు టీనేజ్ అబ్బాయిల గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.