ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసేంతవరకు వెళుతున్నాయి.ఇకపోతే తాజాగా ఓ సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు హత్యకు దారి తీసేలా చేసింది.
హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.అయోధ్య నగర్ కు చెందిన రౌడీషీటర్ వినయ్ రక్షా పురానికి చెందిన సందీప్ సంతోష్ వీరందరూ స్నేహితులు.
అయితే ఈ మధ్యకాలంలో సందీప్, వినయ్ ఫ్రెండ్ నుండి దగ్గర నుండి సెల్ ఫోన్ లాగేసుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వినయ్ ఆ ఫోన్ ఇచ్చేయాలని సందీప్ ను కోరాడు.
అయితే ఆ ఫోను ఇవ్వడానికి ఇష్టపడని సందీప్ ఆ విషయాన్ని తన తమ్ముడు ఆయన సంతోష్ కు తెలిపాడు.ఈ విషయం మీద మాట్లాడడానికి సందీప్ అతని సోదరుడు సంతోష్ ఇద్దరు కలిసి వినయ్ ఇంటికి మంగళవారం నాడు వెళ్లారు.
అయితే ఆ సమయంలో వినయ్ ఇంట్లో లేడు.ఆ తర్వాత వారిద్దరు స్నేహితులు ఇంటికి వచ్చిన ఈ విషయాన్ని తల్లి చెప్పడంతో వినయ్ సందీప్ కి ఫోన్ చేసి గొడవ పడ్డారు.
ఆ తర్వాత సందీప్, సంతోష్ లు ఇద్దరూ దిల్సుఖ్నగర్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న వినయ్ బుధవారం రాత్రి 1:00 సమయంలో అక్కడికి చేరుకున్నాడు.అక్కడ ఫోన్ విషయంలో వారి ముగ్గురి మధ్య వాగ్వివాదం జరిగింది.అయితే ఆ సమయానికి పూర్తిగా మద్యం మత్తులో ఉన్న సందీప్ తనతో ఉన్న కత్తితో విచక్షణారహితంగా వినయ్ ని పొడిచాడు.దీనితో తీవ్రగాయాలైన వినయ్ అక్కడికక్కడే మరణించాడు.
అయితే ఆ విషయాన్ని ఇద్దరు అన్నదమ్ములు వినయ్ తల్లి కి ఫోన్ చేసి చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు.దీంతో వినయ్ తల్లి లలిత వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయాన్ని తెలపగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.