టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి పోలీస్ట్ స్టేషన్ ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగారు.అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమం చేపట్టి, ట్రాఫిక్ కు, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించారని తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు జిల్లా ఎస్పీ ఫకీరప్పను కలిసి కౌన్సిలర్లపై దాడులు జరుగుతున్న సమయంలో పోలీసులు స్పందించిన తీరుపై జేసీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.