ప్రస్తుతం ప్రపంచదేశాల్లోనూ కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.చైనాలోని వూహాన్ నగరంలో పురుడు పోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.
ప్రపంచదేశాలకు కంటికి కనిపించని శుత్రువుగా మారింది.ఈ మహమ్మారి దెబ్బకు చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇక ఈ ప్రాణాంతక వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, శానిటైజర్ రాసుకోవడం, సామాజిక దూరం పాటించడం చాలా ముఖం అయిపోయింది.ముఖ్యంగా మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్లిన వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు విధిస్తున్నాయి.
కఠన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.
కరోనా వేగంగా విజృంభిస్తున్న వేళ తమ డాబు, దర్పాలను ప్రదర్శించడానికి ధనవంతులు వినూత్నంగా ఆలోచించి వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త, సంపన్నుడు ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ.
టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని ఆర్డర్ చేశారు.
ఈ మాస్కు కోసం ఏకంగా సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధం అయ్యాడు ఆ చైనా వ్యాపారి.ఈ విషయాన్ని జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఓ మీడియా సంస్థకు తెలిపారు.
ఈ క్రమంలోనే 18 క్యారెట్ల వైట్ గోల్డ్తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు.అంతేకాదు, మాస్కు చుట్టూ 3,600 వైట్, బ్లాక్ వజ్రాలతో అమర్చనున్నట్టు పేర్కొన్నాడు.అతి ఖరీదైన ఈ మాస్కును ఈ ఏడాది చివరి నాటికి తయారు చేయనున్నట్టు వివరించారు.