మంచితనం కొన్ని సార్లు ప్రాణాలు తీస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మంచి తనంతో మనం ఏదైనా మంచి చేయాలని చూస్తే దాన్ని అదునుగా, అలుసుగా తీసుకునే కొందరు మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.
తాజాగా ఉత్తర ప్రదేశ్లో ఒక మహిళను ఒక కుర్రాడు చేసిన మోసం అత్యంత దారుణమైన మోసంగా చెప్పుకోవాలి.అమ్మ, అక్క అంటూ ఆమెను నమ్మించి మోసం చేశాడు.
చివరకు ఆమె ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకు వచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆనంది అనే 40 ఏళ్ల మహిళ ఒంటరిగా జీవిస్తుంది.ఆమెకు పెళ్లి అయ్యి విడాకులు అయ్యాయి.
పిల్లలు కూడా లేకపోవడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.ఆమె తాను సంపాదించేదాంట్లో కొంత మొత్తం అయినా సాయం చేసేందుకు సిద్దంగా ఉంటుంది.
ఈవిడ గురించి తెలుసుకున్న కమలేష్ తనకు సాయం కావాలంటూ సంప్రదించాడు.నిండా ఇరువై ఏళ్లు కూడా లేని కమలేష్ ఆవిడను అక్క అంటూ బుట్టలో పడేసుకున్నాడు.
ఆమెను మెల్ల మెల్లగా పూర్తిగా తనవైపుకు తిప్పుకున్నాడు.
అక్క అంటూ తనకు తల్లి లేదు నువ్వే నా తల్లి అంటూ ఆనందిని మచ్చిక చేసుకున్నాడు.ఆమె ఆస్తిపై కన్ను వేశాడు.ఆమె ఆస్తిని అప్పటికే అనాధలకు రాసిందని తెలుసుకున్న కమలేష్ ఆమె వద్ద ఉన్న బంగారు నగలను తీసుకుని ఉండాయించాలని ప్రయత్నించాడు.
అందుకోసం ఒక స్నేహితుడి పెళ్లి అంటూ చెప్పి ఆనందిని తీసుకు వెళ్లాడు.వివాహ వేడుకకు వెళ్తున్న కారణంగా ఆమె మెడలో 150 గ్రాముల బంగారం వేసుకోవడం జరిగింది.
అప్పటికే ప్లాన్ చేసిన కమలేష్ తన స్నేహితులతో ఆమెపై దాడి చేసి బంగారం తీసుకుని పారిపోయారు.ఆమెను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరింది.ఆమె ప్రస్తుతం బాగానే ఉంది.కమలేష్ కోసం పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.